Thursday, September 19, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Andhra PradeshKarnataka’s KGF: కేజీఎఫ్‌లో నెల్లూరు యువతి ఆత్మహత్య.....

newStone Latest News

newStone Latest News will fetch all latest posts in...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher : Supreme Court Reiterates

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Karnataka’s KGF: కేజీఎఫ్‌లో నెల్లూరు యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

వరికుంటపాడు, జులై 17: కర్ణాటకలోని కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆత్మహత్య వార్తను జీర్ణించుకోలేక తలకు రాసుకునే నూనె తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నవ దంపతులను బలవంతంగా విడదీసి, వారిని వేరు చేయడంతో రోజుల వ్యవధిలో భార్యభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషాద ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడుకు చెందిన కొండిపోగు జమీమా (27) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. తలకు రాసుకొనే నూనె తాగి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు జమీమాకు కనియంపాడు చర్చి పాస్టర్‌ జాన్‌బాబుతో మే నెల 25వ తేదీన ప్రేమ వివాహం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జమీమా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బంధువులు వారిని విడదీసి అదే నెల 27న కర్ణాటకలోని కేజీఎఫ్‌లో ఉంటున్న బంధువుల వద్దకు పంపారు.

దీంతో మనస్తాపం చెందిన జాన్‌బాబు జూన్‌ 2న కోడూరు బీచ్‌లో ఆత్మహత్యకు చేసుకుని శవమై కనిపించాడు. అయితే అప్పటి నుంచి భర్త మృతి చెందిన విషయం జమీమాకు తెలియదు. ఇటీవల ఆమెకు ఈ విషయం తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. వెంటనే ఇంట్లోని తలకు రాసుకొనే నూనె తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వారు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this