Thursday, September 19, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
HuntTV9 TeluguKerala Vayanad .. గ్రామాలకు గ్రామాలే ధ్వసం.....

newStone Latest News

newStone Latest News will fetch all latest posts in...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher : Supreme Court Reiterates

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Kerala Vayanad .. గ్రామాలకు గ్రామాలే ధ్వసం.. నిద్రలోనే ప్రాణాలు పోగొట్టుకున్న వందలాది మంది.. ఫోటోలు చూస్తే కన్నీరు ఆగదు..

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Table of contents

Kerala Vayanad .. గ్రామాలకు గ్రామాలే ధ్వసం.. నిద్రలోనే ప్రాణాలు పోగొట్టుకున్న వందలాది మంది.. ఫోటోలు చూస్తే కన్నీరు ఆగదు..అందాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కేరళ వాయనాడ్ లో భారీ వర్షాలతో అతిపెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గ్రామం తర్వాత గ్రామం ధ్వంసమైంది. అనేక కుటుంబాలు ధ్వంసమయ్యాయి. జులై 30 ఉదయం ప్రజలు తమ ఇళ్లలో ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నిరంతర భారీ వర్షాల వలన సహాయక చర్యలకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

Kerala Vayanad

నదులలో శవాలు తేలుతూ వస్తున్నాయి. బురద ప్రవాహం మధ్య ప్రజల శరీర భాగాలు కూడా కనుగొనబడుతున్నాయి. ఇది చాలా బాధాకరమైన దుర్ఘటన.. ఎక్కడ చూసినా బాధితులు, ప్రజల అరుపులు మిన్నంటుతున్నాయి.

వాయనాడ్ జిల్లాలో నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌లకు ఆటంకం కలుగుతోంది, అయినప్పటికీ వాతావరణ పరిస్థితులకు ఎదురీదుతూ తప్పిపోయిన వారి కోసం ఆర్మీ, నేవీ, NDRF రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి.

తెల్లవారుజామున ప్రజలు తమ ఇళ్లలో గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కొండచరియలు విరిగి పడడంతో చాలా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఎక్కడ చూసినా విషాదమే, గ్రామాలకు గ్రామాలే మాయం అయ్యాయి. చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి . నదులు ఉప్పొంగుతున్నాయి. వందలాది మంది కనిపించడం లేదు.

ఇప్పటి వరకు ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా వందలాది మంది మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. శిథిలాలలో లభించిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వివిధ ఆసుపత్రుల మార్చురీలకు తరలిస్తున్నారు.

వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వస్తున్న చిత్రాలలో విధ్వంసం దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. వాహనం పూర్తిగా పాడైపోయి మట్టిలో ఎలా కప్పబడిందో ఈ చిత్రాలలో చూడవచ్చు. కుప్ప కూలిన ఇల్లు, విరిగిన వాహనాలకు సంబంధించిన భయానక దృశ్యాలు చూస్తే కొండచరియలు చేసిన గాయాన్ని అంచనా వేయవచ్చు.

వాయనాడ్ ప్రజలకు జూలై 30, 2024 తేదీ చాలా బాధాకరమైన రోజుగా నిలిచిపోతుంది. చాలా మందికి కళ్ళు తెరవడానికి కూడా అవకాశం లేదు. అక్కడ తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమవగా, నదుల ప్రవాహానికి పలువురు గల్లంతయ్యారు.

కొండచరియలు విరిగిపడటంతో నదుల ప్రవాహం వేగంగా మారింది. శిథిలాలలో చిక్కుకుని చాలా మంది చనిపోయారు. పలువురు కుటుంబ సభ్యులు మృతదేహాలను గుర్తించారు.

నదుల ప్రవాహం ఉధృతంగా మారింది. దీంతో ప్రజలతో పాటు పలు ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. గ్రామ ప్రాంతాలలో చుట్టూ నీరు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పకృతి చేసిన విధ్వంసం స్పష్టంగా కనిపిస్తుంది.

భారీ వర్షాల మధ్య ప్రజలను రక్షించే పనిలో NDRF కి చెందిన మూడు బృందాలు పనిచేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ప్రభావిత ప్రాంతాన్ని సమీప పట్టణానికి కలిపే తాత్కాలిక వంతెన కూలిపోయింది. భారత సైన్యం తాడుతో కలుపుతూ సహాయక చర్యలను చేస్తోంది.

ముండకైలో అనేక మృతదేహాలు పేరుకుపోయినట్లు సమాచారం. వీటిని మేపాడుకు తరలించ చేయలేకపోయారు. కుప్పకూలిన భవనాలపై మృతదేహాలు పడి ఉన్నాయని ముండకై సమాచారం అందింది. అక్కడికి చేరుకోవడానికి మార్గం లేదు.. దీంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఇళ్లు ధ్వంసమై ఆహారం, నీరు కరువయ్యాయి. 12 గంటల పాటు విద్యుత్ సౌకర్యం లేదు. దీంతో చాలా మంది ఫోన్‌లు స్విచ్‌ఆఫ్‌ కావడంతో రెస్క్యూ ఆపరేషన్లపై ఈ ప్రభావం పడింది.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this