Sunday, September 8, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Andhra PradeshMinister Atchannaidu: వ్యవసాయ అధికారులకు మంత్రి అచ్చెన్న...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher : Supreme Court Reiterates

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher...

AP Ganesh Mandapam Permission Application Process 2024

AP Ganesh Mandapam Permission Application Process వినాయక చవితి ఉత్సవాలకు...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Minister Atchannaidu: వ్యవసాయ అధికారులకు మంత్రి అచ్చెన్న కీలక ఆదేశాలు..

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Minister Atchannaidu: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు దంచికొడుతోన్న సమయంలో.. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి.. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొనే రైతులకు క్షేత్ర స్థాయిలో సూచనలు అందించాలి.. రాష్ట్రంలో పంట నష్టం అంచనా వేయండి.. రైతు సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయండి అంటూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు..

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలన్న మంత్రి అచ్చెన్నాయుడు.. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ కి కీలక సూచనలు చేశారు.. ఈ రోజు రాజశేఖర్ తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా పంట నష్టం అంచనా వేయాలని సూచనలు చేశారు.. జిల్లాల వారీగా వర్షపాతం ఎప్పటికప్పుడు నమోదు చేసి అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.. కాగా, ఏపీలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా.. పలు జిల్లాల్లో ఈ రోజు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన విషయం విదితమే.. మరోవైపు.. ఈ రోజు కూడా ఏపీకి వర్ష సూచన ఉందని తెలిసింది వాతావరణ శాఖ.

Source: NTV Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this