Friday, October 18, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Andhra PradeshSrisailam: శ్రీశైలం క్షేత్రంలో అంకాళమ్మ అమ్మవారికి ఘనంగా...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

Firki Maths TPD Blended Course Test Quiz Questions and Answers

Firki Maths TPD Blended Course Test Quiz Questions and...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

APTET 2024 Hall Tickets Download [Released] AP TET Admit Cards Direct Link aptet.apcfss.in

APTET 2024 Hall Tickets Download - APTET 2024 Sep...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Srisailam: శ్రీశైలం క్షేత్రంలో అంకాళమ్మ అమ్మవారికి ఘనంగా బోనం సమర్పణ

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో శ్రీశైల మహాక్షేత్రం గ్రామ దేవత అంకాళమ్మ అమ్మవారికి ఆలయ అధికారులు, అర్చకులు ఆదివారం ఘనంగా బోనం సమర్పించారు. మూల నక్షత్రం సందర్భంగా లోక కల్యాణం కోసం దేవస్థానం తరుఫున బోనాలు సమర్పించడం గత కొంతకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఉదయం ఆలయ మహాద్వారం నుంచి శ్రీస్వామి అమ్మవారి ఆలయాల ప్రధానార్చకులు ఆలయ ఏఈవో హరిదాసు పలువురు అర్చకులు, వేదపండితులు సంప్రదాయ బద్దంగా నూతన పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు, గాజులు, ఫలపుష్పాలు, నివేదన మొదలైనవాటితో అంకాళమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాదికాలు జరిపి బోనాన్ని సమర్పించారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, జనులందరూ సంతోషంగా ఉండాలని సుఖసంతోషాలు, సంకల్పము పఠించి అంకాళమ్మ అమ్మవారికి విశేషపూజాదికాలతో బోనం సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఏఈఓ హరిదాసు, అర్చకస్వాములు, వేదపండితులు కలిసి సంప్రదాయబద్ధంగా నూతన పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు, గాజులు, ఫలాలు, పుష్పాలు సమర్పించి పూజలు నిర్వహించారు.

Source: TV9 Telugu


Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by newStone.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this