Thursday, October 17, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Elon Musk: భారతీయుల ప్రతిభతోనే అమెరికా అభివృద్ధి.....

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

Firki Maths TPD Blended Course Test Quiz Questions and Answers

Firki Maths TPD Blended Course Test Quiz Questions and...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

APTET 2024 Hall Tickets Download [Released] AP TET Admit Cards Direct Link aptet.apcfss.in

APTET 2024 Hall Tickets Download - APTET 2024 Sep...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Elon Musk: భారతీయుల ప్రతిభతోనే అమెరికా అభివృద్ధి.. ఎలన్ మస్క్ సంచలన ట్విట్..

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 Elon Musk on Parag Agrawal: ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా భారత సంతతి టెక్కీ పరాగ్ అగర్వాల్ నియామకమైన సంగతి తెలిసిందే. సీఈ‌వోగా ఉన్న ట్విట్టర్‌ సహ వ్యవ‌స్థా‌ప‌కుడు జాక్‌ డోర్సే సోమ‌వారం పదవీ నుంచి దిగి‌పో‌వ‌డంతో ఆయన స్థానంలో చీఫ్‌ టెక్ని‌కల్‌ ఆఫీ‌స‌ర్‌గా పని‌చే‌స్తున్న పరాగ్‌ అగ‌ర్వా‌ల్‌ను సంస్థ బోర్డు ఏక‌గ్రీ‌వంగా నియమించింది. 2006 నుంచి డోర్సే ట్విట్టర్‌ సార‌థిగా కొన‌సా‌గు‌తూ వస్తున్నారు. అయితే.. ట్విట్టర్ సీఈఓగా భారత వ్యక్తిని నియమించడంపై టెస్లా బిలియనీర్ ఎలోన్ మస్క్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. భారతీయ ప్రతిభ నుంచి అమెరికా చాలా ప్రయోజనం పొందింది అంటూ అని టెస్లా బాస్ మస్క్ ట్వీట్ చేశారు.

గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబిఎమ్ వంటి ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతి వ్యక్తులపై పాట్రిక్ కొల్లిసన్ చేసిన ఓ ట్వీట్‌కు ఆయన సమాధానమిచ్చారు. గూగుల్-పెరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ CEOగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ CEOగా సత్య నాదెళ్ల సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అలాంటి ప్రముఖ US టెక్ సంస్థకు నాయకత్వం వహించనున్న పరాగ్ అగర్వాల్ కూడా అత్యంత ప్రతిభావంతుడని కొనియాడారు. కాగా.. ఎలన్ మస్క్ ట్విట్‌పై చాలామంది స్పందిస్తూ రీట్విట్ చేస్తున్నారు. వారంతా అత్యంత ప్రతిభావంతులని కొనియాడుతున్నారు.

ఇప్పటికే గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓగా శాంతను నారాయణ్, ఐబీఎంకు అరవింద్ కృష్ణ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వారి సరసన పరాగ్ అగర్వాల్ చేరారు. అగర్వాల్ 2011లో కంపెనీలో చేరారు. అక్టోబర్ 2017 నుంచి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో PhD, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే నుండి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

elon musk: భారతీయుల ప్రతిభతోనే అమెరికా అభివృద్ధి.. ఎలన్ మస్క్ సంచలన ట్విట్..

Google, Microsoft, Adobe, IBM, Palo Alto Networks, and now Twitter run by CEOs who grew up in India. Wonderful to watch the amazing success of Indians in the technology world and a good reminder of the opportunity America offers to immigrants. 🇮🇳🇺🇸 (Congrats, @paraga!)

— Patrick Collison (@patrickc) November 29, 2021

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this