Tuesday, September 17, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Mobile Screen: రాత్రిపూట మొబైల్‌ స్క్రీన్‌ అధికంగా...

newStone Latest News

newStone Latest News will fetch all latest posts in...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher : Supreme Court Reiterates

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Mobile Screen: రాత్రిపూట మొబైల్‌ స్క్రీన్‌ అధికంగా చూస్తున్నారా.. ఈ వ్యాధి వచ్చే అవకాశం..

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 Mobile Screens: రాత్రిపూట మొబైల్‌ స్క్రీన్‌ ఎక్కువగా చూస్తున్నారా అయితే మీకు మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని ఇటీవల స్ట్రాస్‌బర్గ్, ఆమ్‌స్టర్‌డామ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తేల్చారు. ఇది వింటే మీకు షాకింగ్‌ అనిపించవచ్చు. కానీ ఇది నిజమని నిరూపణ అయింది. రాత్రిపూట బ్లూ లైట్‌కి అడిక్ట్‌ కావడం వల్ల రక్తంలో తియ్యటి ఆహారాలు తినాలనే కోరిక పెరుగుతుందని వీరు నిర్దారించారు. అంతేకాదు అధికంగా ఊబకాయం బారిన పడుతున్నారని తేలింది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతున్నాయని గుర్తించారు. 

స్ట్రాస్‌బర్గ్ విశ్వవిద్యాలయం, ఆమ్‌స్టర్‌డామ్ విశ్వవిద్యాలయ వైద్యులు ఎలుకలపై చేసిన పరిశోధనలో ఈ నిజాలు తెలుసుకున్నారు. రాత్రిపూట కృత్రిమ కాంతిలో ఎలుకలను ఉంచినప్పుడు వాటి శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగినట్లు వారు కనుగొన్నారు. అలాగే చాలా సేపు ఈ లైట్‌కి ఎక్స్‌పోజ్ అయిన తర్వాత వాటి బరువు పెరిగినట్లు నిర్దారించారు. ఎలుకల శరీరంలో ఉండే 80 శాతం హార్మోన్లు, శారీరక విధులు మానవులతో సమానంగా ఉంటాయి. కాబట్టి శాస్త్రవేత్తలు అనేక వందల సంవత్సరాల నుంచి మానవ శరీరానికి ముందు ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఎలుకలపై చేసిన దాదాపు 100% ప్రయోగాలు మానవులపై నిజమని తేలాయి. 

మీరు రాత్రిపూట టీవీ చూసినప్పుడు కానీ మొబైల్ స్క్రీన్ ముందు ఉన్నప్పుడు కానీ స్వీట్లు, ఇతర తియ్యటి ఆహారాలు తినాలనిపిస్తే దానికి కారణం కృత్రిమ నీలం. అందుకే మీరు గాడ్జెట్స్‌ పై సమయాన్ని తగ్గించుకుంటే మంచిది. ఒకవేళ మీ పనికి ల్యాప్‌టాప్, మొబైల్ చూడటం తప్పనిసరి అయితే బ్లూ లైట్ రేడియేషన్‌ను నివారించడానికి ఖచ్చితంగా యాంటీ గ్లేర్ గ్లాసెస్ ఉపయోగించండి. ఎందుకంటే ఇది నేరుగా మన కళ్లపై ప్రభావం చూపదు.

mobile screen: రాత్రిపూట మొబైల్‌ స్క్రీన్‌ అధికంగా చూస్తున్నారా.. ఈ వ్యాధి వచ్చే అవకాశం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this