Thursday, September 19, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
YSRCP: ఎంపీ ల్యాడ్స్ డబ్బుతో చర్చిల నిర్మాణం.....

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

newStone Latest News

newStone Latest News will fetch all latest posts in...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher : Supreme Court Reiterates

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

YSRCP: ఎంపీ ల్యాడ్స్ డబ్బుతో చర్చిల నిర్మాణం.. కేంద్రం బిగ్ షాక్.. జగన్ సర్కారుకు సంచలన లేఖ!

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఎంపీ ల్యాడ్స్ నిధులపై ఏపీ సీఎస్‌కు లేఖ రాశారు.

జగన్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఊహించని షాకిచ్చింది. క్రైస్తవ మతపరమైన విషయం మరోసారి చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో చర్చిలకు ఎంపీ ల్యాడ్స్‌ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ రమ్య.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ పంపారు.
ఎంపీలకు ప్రతి ఏటా ఇచ్చే నిధుల్లో రూ.40 లక్షలకు పైగా నిధుల్ని బాపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు నందిగం సురేష్ చర్చిలకు వినియోగించినట్లు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రెండు నెలల క్రితం వైసీపీ రెబల్ రఘురామ కృష్ణరాజు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో)కు లేఖ రాశారు.
ప్రత్యేక పరిస్థితుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన ఈ డబ్బులను మత సంబంధమైన కార్యక్రమాలకు, మతపరమైన భవనాల నిర్మాణాలకు ఖర్చు చేస్తున్నట్టుగా వచ్చిన కథనాలను ఆయన పీఎంవోకు నివేదించారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మతమార్పిడులకు కూడా ఈ నిధులు వినియోగిస్తున్నట్లుగా ఎంపీ రఘురామ ఆరోపించారు.
దీంతో ఈ లేఖపై నివేదిక పంపాలని జగన్ సర్కారుకు రెండు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో సాధ్యమైనంత త్వరగా నివేదిక పంపాలని తాజాగా కేంద్రం లేఖ రాసింది. ఇప్పటికే నివేదిక కోరినా పంపించలేదని, అందుకే మరోసారి గుర్తు చేస్తున్నట్టు పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా కేంద్రానికి నివేదిక పంపాలని లేఖలో డైరెక్టర్‌ రమ్య కోరారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ysrcp: ఎంపీ ల్యాడ్స్ డబ్బుతో చర్చిల నిర్మాణం.. కేంద్రం బిగ్ షాక్.. జగన్ సర్కారుకు సంచలన లేఖ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this