న్యూస్ టోన్, అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): 2022 మార్చిలో ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ పరీక్షలు రాసే విద్యార్థులు హాజరు శాతం తగ్గితే ఈనెల 23వ తేదీలోపు రూ.1,300 ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. ఆ తేదీలోపు చెల్లించనివారు దానికి మరో రూ.200 లేట్ ఫీజు కలిపి ఈనెల 30లోపు చెల్లించవచ్చని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.