JAC Meeting: రాష్ట్ర ప్రభుత్వఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ )సెక్రటేరియట్ సమావేశం ఈనెల 20వ తేదీ విజయవాడ ఏపీ ఎన్జీవో హోంలో నిర్వహించనున్నట్లు ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ జి హృదయ రాజు తెలిపారు. ఈనెల 21న ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలపై సి ఎస్ ఆధ్వర్యంలో కార్యదర్శిల సమావేశం జరుగుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది .ఉదయం పదిన్నర గంటలకు జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించే జేఏసీ సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు సంబంధించి అనేక సమస్యలపై చర్చించనున్నట్లు హృదయ రాజు తెలిపారు. పదకొండవ పిఆర్సి ,సి పి ఎస్ రద్దు ,పెండింగ్ డీఏలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ,జిపిఎఫ్, సరెండర్ లీవ్ ,మెడికల్ రీయంబర్సుమెంట్ , గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర బిల్లులు మంజూరు జేఏసీలో ఖాళీ పోస్టుల భర్తీ, ఇతర డిమాండ్లను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు హృదయరాజు తెలిపారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సమావేశానికి ఏపీ జెఎసి సెక్రటేరియట్ సభ్యులు తప్పక హాజరుకావాలని హృదయ రాజు పేర్కొన్నారు.