Tuesday, September 17, 2024
newStone - We will update latest news around the world. newStone is leading digital news website in Telugu.
Without Ration Card : రేషన్ కార్డు...

newStone Latest News

newStone Latest News will fetch all latest posts in...

newStone Scripts and Projects and Tools

newStone Scripts and Projects and Tools created for teacher,...

Download School Attendance App Updated App Version

School Attendance App Updated - Download School Attendance App...

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher : Supreme Court Reiterates

B.Ed. Degree Not A Qualification For Primary School Teacher...

🗣️ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు ముఖ్య గమనిక. 📻 మీరు లేదా మీ పిల్లలచే రూపొందించ బడిన కథలు, పద్యాలు, నాటికలు, పాఠాలు, స్పోకెన్ ఇంగ్లీష్.. ఇతరాలు మా ఆన్లైన్ రేడియో లో ఉచితంగా ప్రసారం చేయబడును. దీనికి గాను మీరు రూపొందించిన ఆడియో ఫైల్ ను ఏ విధమైన బాక్ గ్రౌండ్ నాయిస్ లేకుండా మాకు 9493308090 నంబర్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపండి. ఆడియో ఫైల్ ప్రారంభం లో మీ పేరు, ఊరు వంటి వివరాలు చెప్పి, మీరు చెప్పాలనే అంశం పేర్కొని ఆడియో ఫైల్ పంపండి. తదుపరి ప్రసారం చేసే సమయం మీకు తెలియ చేస్తాం. రేడియో ప్రసారాలను newstone.in యొక్క ప్రతి లింక్ మీద వినవచ్చును

Without Ration Card : రేషన్ కార్డు లేకుండా ఉచితంగా బియ్యం, గోధుమలు పొందడం ఎలా..? ఇలా చేస్తే మీరు కూడా అర్హులవుతారు..?

https://whatsapp.com/channel/0029VaAncF75q08iklatTd27 https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Without Ration Card : కరోనా కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ 9వ సారి దేశాన్ని ఉద్ధేశించి ప్రసంగించారు. 

కరోనాకు వ్యతిరేకంగా చేసిన పోరాటం, రెండో వేవ్‌ను ఎదుర్కోవటానికి చేసిన ప్రయత్నాలు, ఆక్సిజన్ డిమాండ్, సరఫరా, కరోనా టీకా, 80 కోట్లకు పైగా దేశస్థులకు ఉచిత ఆహార ధాన్యాలు వంటి అంశాల గురించి ప్రసంగించారు. దేశవాసులకు ఉచిత రేషన్ ప్రకటించిన ప్రధాని మోదీ ప్రధాన్ మంత్రి గారిబ్ కల్యాణ్ అన్నా యోజనను దీపావళి వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. మహమ్మారి ఉన్న ఈ సమయంలో పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు. నవంబర్ నాటికి 80 కోట్లకు పైగా దేశస్థులకు ప్రతి నెలా ఉచిత ఆహార ధాన్యాలు లభిస్తాయని స్పష్టం చేశారు.

రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ పథకం ప్రయోజనం లభిస్తుంది..

అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈసారి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన కింద రేషన్ కార్డు లేని వారికి కూడా ఉచిత ఆహార ధాన్యాలు లభిస్తాయి. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవటానికి వారు ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ విషయంలో ప్రధాని మోదీ ప్రకటించిన తరువాత ఎవరికైనా రేషన్ కార్డు లేకపోతే, అతను తన ఆధార్ తీసుకొని రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుందని, ఆ తర్వాత అతనికి స్లిప్ ఇస్తామని ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ స్లిప్ చూపించిన తరువాత వారికి ఉచిత ఆహార ధాన్యాలు లభిస్తాయని తెలిపారు.

పేద కూలీలకు ఉచిత రేషన్ ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని కోరారు. గరీబ్ కల్యాణ్ అన్నా యోజన కింద లభించే ఉచిత 5 కిలోల ఆహార ధాన్యాలు రేషన్ కార్డులో లభించే ఆహార ధాన్యాల కోటాతో పాటు ఉంటాయి. అంటే రేషన్ కార్డులో ఇప్పటికే ఆహార ధాన్యాలు పొందిన వారికి 5 కిలోల ఎక్కువ రేషన్ లభిస్తుంది. దీని కోసం వారు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మహమ్మారి సమయంలో ఏ పేదలూ ఆకలితో నిద్రపోకూడదనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అంతకుముందు కరోనా రెండో వేవ్‌ మధ్యలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రెండు నెలలు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది దానిని ఇప్పుడు నవంబర్ వరకు పొడిగించారు.

without ration card : రేషన్ కార్డు లేకుండా ఉచితంగా బియ్యం, గోధుమలు పొందడం ఎలా..? ఇలా చేస్తే మీరు కూడా అర్హులవుతారు..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

You may like this